
నిర్మల్, వెలుగు: జర్నలిస్టులకు అండగా ఉంటానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్లోని ఆర్కే ఫంక్షన్ హాల్లో స్థానిక ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లబ్అధ్యక్షుడు రాసం శ్రీధర్, ప్ర ధాన కార్యదర్శి బాస లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.
మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, ఐఎంఏ అధ్యక్షుడు మురళీధర్, రాష్ట్ర బాధ్యుడు చక్రధారి తదితరులు పాల్గొన్నారు.